వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి

  • బీజేపీతో వైసీపీ సంబంధం ఈనాటిది కాదు
  • నాడు 9 మంది ఎంపీలతో కలిసి జగన్ ఢిల్లీలో మోదీని కలిశారు
  • బీజేపీ వెంటే ఉంటామని నాడే చెప్పారు
  • అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా
బీజేపీతో వైసీపీ సంబంధం ఈనాటిది కాదంటూ ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు ఎన్నికలు ఫలితాలు వచ్చినరోజే 9 మంది ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన జగన్, మోదీని కలిశారని, ఆ సమయంలో తాను వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు.

తాము బీజేపీ వెంటే ఉంటామని చెప్పి ఆ పార్టీ నేతలకు జగన్ ఆరోజే చెప్పారని అన్నారు. మిత్రపక్షం శత్రుపక్షమైందని, శత్రుపక్షం మిత్రపక్షమైందనే విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానని అన్నారు. అసెంబ్లీకి, శాసన మండలికి రాకుండా తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, సమావేశాలకు హాజరుకావాలని హితవు పలికారు.
Go Back to Shorts
YSRCP
Telugudesam
adinarayana reddy

More Telugu News