కన్నులపండువగా భద్రాద్రి రాములోరి కల్యాణం

  • అభిజిత్ లగ్నంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
  • రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల
  • అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ గైర్హాజరు
భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం ఈ రోజు మధ్యాహ్నం కన్నులపండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన మిథిలా ప్రాంగణంలో వైభవంగా జరిగిన ఈ కల్యాణ మహోత్సవానికి భక్తులు అశేషంగా హాజరయ్యారు. అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారి మెడలో స్వామివారు మాంగల్యధారణ చేశారు. ఈ కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన హాజరుకాకపోవడంతో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ మహోత్సవంలో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఉదయం మూల విరాట్‌కు సుప్రభాత ఆరాధన నిర్వహించిన సంగతి తెలిసిందే. రేపు స్వామి వారి పట్టాభిషేకం జరుగుతుంది.
Go Back to Shorts
Bhadrachalam
Sir Ram
Sita
KCR
Tummala Nageswar rao

More Telugu News