చెత్తకుప్పలో లక్ష రూపాయలు... వెతుకుతున్న వ్యక్తికి అప్పగించిన పారిశుధ్ధ్య కార్మికురాలు
- మెట్ పల్లి కూరగాయల మార్కెట్ సమీపంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్న జావేద్
- గత రాత్రి షాప్ మూసే సమయంలో డబ్బులు, చికెన్ చెత్తను వేర్వేరు కవర్లలో తీసుకెళ్లిన జావేద్
- లక్ష రూపాయల కవర్ ను చెత్తకుప్పలో పడేసి ఇంటికెళ్లిన వైనం
ఉదయం లేచి డబ్బుల కోసం కవర్ తెరవగా, అందులో చెత్త ఉండడం చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో వెంటనే సంచీ కోసం గతరాత్రి పారేసిన చెత్తలో వెతకడం ప్రారంభించాడు. దానిని చూసిన పారిశుద్ధ్య కార్మికురాలు లక్ష్మి ఏం వెతుకుతున్నావని ఆరాతీసింది. డబ్బులు పారేశానన్న విషయాన్ని చెప్పాడు.
దీంతో డబ్బులు ఎక్కడికీ పోలేదని, అక్కడ దొరికిన ఆ డబ్బును తాను దాచి ఉంచానని తెలిపింది. దాచిన డబ్బును తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. లక్ష రూపాయల నగదు తన కంటపడినా ఎలాంటి అత్యాశకు పోకుండా తిరిగి ఇచ్చిన ఆమె నిజాయతీని చూసిన జావేద్ ఆమెకు నజరానాగా 5 వేల రూపాయలు అందజేశాడు. ఆమె నిజాయతీని మార్కెట్ లోని వారంతా మెచ్చుకున్నారు.