దేశ సైబర్ సెక్యూరిటీ చీఫ్ నెట్ బ్యాంకింగ్ కు దూరం... ఎందుకని?
- నెట్ బ్యాంకింగ్ ను తక్కువగా వినియోగిస్తా
- ఎందుకంటే దానివల్ల సమస్యలేంటో నాకు తెలుసు
- ఖాతాలో రూ25,000 లోపు ఉంచే డెబిట్ కార్డు వాడతా
‘‘అక్కడ కొన్ని సమస్యలున్నాయి. ఈ కామర్స్ వేదికలపై నియంత్రణ ఎవరిది? వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించేది ఎలా? ఏటీఎంలు, క్రెడిట్ కార్డు మోసాలు చాలా సంక్లిష్టమైనవి. వాటిని పరిష్కరించడం ఒకింత కష్టం’’ అని రాయ్ చెప్పారు.
‘‘నాకు ఒక ప్రత్యేక ఖాతా ఉంది. అందులో కొంచెమే నగదు ఉంచుతాను. డెబిట్ కార్డుతో లావాదేవీలు చేయాలనుకుంటే ఆ ఖాతాలో రూ.25,000 మాత్రమే ఉంచి చేస్తాను. దాంతో జాతీయ వినియోగారుల సంస్థ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు’’ అని ఆయన చెప్పారు. సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ప్రధానమంత్రి మోదీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసి దానికి తొలి బాస్ గా రాయ్ ను నియమించిన విషయం గమనార్హం.