భూపాలపల్లి సమీపంలో భారీ ఎన్ కౌంటర్... మావో అగ్రనేతలు సహా 11 మంది హతం!
- చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్
- 11 మంది మావోయిస్టుల మృతి
- అమరుడైన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్
- పలువురికి గాయాలు
తమకు ఎదురైన మావోలను లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా ఫైరింగ్ ప్రారంభించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ ప్రారంభించాల్సి వచ్చిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అమరుడైనట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు పోలీసులకూ గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఘటన జరిగిన ప్రాంతం నుంచి పదుల సంఖ్యలో మావోలు పారిపోయారని, అక్కడి నుంచి భారీ ఎత్తున తుపాకులు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.