Chandrababu: జగన్ కేసులపై టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు వ్యాఖ్యలు

  • వైసీపీ అవకాశవాదంతో పని చేస్తోంది
  • జగన్ కేసుల మాఫీ కోసం వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు
  • మనం మాత్రం ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేద్దాం
ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఇప్పటికీ వైసీపీ అవకాశవాదంతోనే పని చేస్తోందని ఆయన విమర్శించారు. జగన్ పై ఉన్న కేసుల మాఫీ కోసం ఆ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వాళ్లు కేసుల మాఫీ కోసం యత్నిస్తున్నారని... మనం మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేద్దామని ఎంపీలకు ఆయన సూచించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో చేసిన పోరాటం వల్లే ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం దేశ వ్యాప్తంగా తెలిసిందన్నారు. 
Chandrababu
jagan
cases
Telugudesam mps
parliament

More Telugu News