'పద్మావత్' విషయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు చుక్కెదురు
- పునరాలోచన చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- పాత ఆదేశాలనే పాటించాలని ఆదేశం
- సినిమాను కచ్చితంగా విడుదల చేయాలన్న ధర్మాసనం
దీంతో విడుదలను అడ్డుకోవడానికి ఆయా రాష్ట్రాలకు న్యాయపరంగా ఎలాంటి మద్దతు లభించకుండా పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పాటు గుజరాత్, హర్యానాలు కూడా ఈ సినిమా విడుదలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే థియేటర్ యాజమాన్యాలకు హెచ్చరికలు కూడా వెళ్తున్నాయి. సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లు తగలబెడతామని, ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తామని రాజ్పుత్, కర్ని సేనలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో మరి!