సగం రేటుకు 'అమ్మ బైక్'... నిబంధనలు చూసి అమ్మాయిల ఆగ్రహం!

  • జయలలిత జయంతి సందర్భంగా సగం ధరకే బైకులు
  • లైసెన్స్ కలిగి వుండాలన్న నిబంధన అడ్డు
  • బండిలేని తాము లైసెన్స్ ఎందుకు తీసుకుంటామని ప్రశ్నిస్తున్న అమ్మాయిలు
దరఖాస్తుదారులు లేక తొలిరోజే వెలవెలబోతున్న శిబిరం
వచ్చేనెల తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురస్కరించుకుని, తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు సగం ధరకే ద్విచక్ర వాహనాలను 'అమ్మ బైక్'ల పేరిట అందించే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టగా, స్పందన కరవైంది. టూ వీలర్ ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన అమ్మాయిలు.. అక్కడి అధికారులు పెట్టిన నిబంధనలు చూసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి తలెత్తింది.

ఫిబ్రవరి 5 వరకూ దరఖాస్తులను అధికారులు తీసుకోనుండగా, ప్రతి జిల్లా, మండలాల్లో దరఖాస్తులు స్వీకరించే శిబిరాలు ఏర్పాటయ్యాయి. అయితే, దరఖాస్తు చేసుకునే అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధన పలువురి ఆగ్రహానికి కారణమైంది. దీనికితోడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు సర్టిఫికెట్, 40 ఏళ్లలోపు వయసున్నట్టు ధ్రువీకరణను అధికారులు అడుగుతున్నారు. బండ్లే లేని తాము డ్రైవింగ్ లైసెన్సులు ఎందుకు తీసుకుంటామని ప్రశ్నిస్తున్న అమ్మాయిలు, అసలు బైకులను ఎవరికి ఇవ్వాలని చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Amma Bike
Tamilnadu
Jayalalita

More Telugu News