మరో తుగ్లక్ లా మారిన కిమ్ జాంగ్ ఉన్.. ప్రజలపై మరిన్ని ఆంక్షలు

అణ్వాయుధ పరీక్షలతో కంగారు పుట్టిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశ ప్రజల పాలిట పిచ్చి తుగ్లక్ లా మారినట్టు దక్షిణకొరియా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ఆర్థిక ఆంక్షల బారిన పడిన ఉత్తరకొరియా.. వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా, మరిన్ని అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో తన ప్రజలపై అధ్యక్షుడు కిమ్ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారని దక్షిణకొరియా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరకొరియా ప్రజలు వినోదాత్మక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారని ఆ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రజలు సమూహంగా ఏర్పడడాన్ని కూడా నిషేధించారు. మద్యం సేవించడం, పాటలు పాడడంపై కూడా నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఈ నిషేధాజ్ఞలతో ప్రజలపై పట్టు సాధించడమే కాకుండా ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కునేందుకు కూడా దోహదపడతాయని కిమ్ భావిస్తున్నారని దక్షిణకొరియా నిఘా సంస్థ వెల్లడించింది. 
Go Back to Shorts
kim jung un
North Korea
south korea

More Telugu News