వేలంలో అత్య‌ధిక ధ‌ర పలికిన‌ 500 ఏళ్ల నాటి యేసు క్రీస్తు పెయింటింగ్‌!

ప్రముఖ చిత్ర‌కారుడు లియొనార్డో డావిన్సీ గీసిన‌ట్టుగా చెబుతున్న 500 ఏళ్ల నాటి యేసు క్రీస్తు పెయింటింగ్, న్యూయార్క్‌లో నిర్వ‌హించిన వేలంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయింది. 450.3 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్ముడై ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడైన క‌ళాత్మ‌క చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు వేలంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడైన క‌ళాత్మ‌క చిత్రంగా పికాసో గీసిన `ద విమెన్ ఆఫ్ అల్జీర్స్` నిలిచింది. అప్పుడు ఈ చిత్రం 179.4 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్ముడైంది. దీనితో పోల్చిన‌పుడు ప్ర‌స్తుత డావిన్సీ చిత్రం రెట్టింపు ధ‌ర‌కు అమ్ముడై రికార్డు బద్దలు కొట్టింద‌ని వేలం నిర్వాహ‌కులు తెలిపారు.

auction
davinci
leonardo
usa
new york
picaso
pablo

More Telugu News