యాక్సిడెంటు ఘటనలో.. నటుడు రాజశేఖర్ కుమార్తె శివానిపై కేసు నమోదు!
- పార్క్ చేసిన కారును ఢీకొన్న శివాని కారు
- బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
- రెండు రోజులు ఆలస్యంగా వెలుగులోకి!
ఈ ఘటనపై ఎస్పీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ఆపరేషనల్ మేనేజర్ అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. శివానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. శివాని యాక్సిడెంట్ గురించి శనివారం రాత్రే వార్తలు వచ్చినా కేసు నమోదు కాకపోవడంతో అధికారికంగా వెలుగులోకి రాలేదు.