న్యూయార్క్ లో మరో ఉగ్రదాడి.. ట్రక్కుతో బీభత్సం సృష్టించిన దుండగుడు.. ఎనిమిది మంది మృతి!
- ఉగ్రదాడిలో 8 మంది మృతి.. 11 మందికి తీవ్ర గాయాలు
- దాడి తర్వాత ‘అల్లాహు అక్బర్’ అని అరుస్తూ పరుగులు పెట్టిన ఉగ్రవాది
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితుడిని సైపోవ్ (29)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం స్కూలు బస్సును ఢీకొట్టిన సైపోవ్ ట్రక్కు దిగి ‘అల్లాహు అక్బర్’ అని అరుస్తూ హైవే వెంబడి పరుగులు తీశాడు. ఆ సమయంలో అతడి చేతిలో పెల్లెట్ గన్ ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సైపోవ్ 2010లో అమెరికాకు వలస వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దాడికి ఉపయోగించిన ట్రక్కు వద్ద అరబిక్లో రాసిన లేఖను గుర్తించారు. దీనిని బట్టి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్తో అతడికి సంబంధాలున్నట్టు తెలుస్తోందని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఇది ఉగ్రదాడేనని మేయర్ బిల్ డే బ్లాసియో ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ట్రక్కు దాడిపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.