పాత ట్రెండ్ లోకి చంద్రబాబు.. విజయవాడలో ఆకస్మిక తనిఖీలు!

  • ఏడాది తర్వాత ఆకస్మిక తనిఖీలను చేపట్టిన సీఎం
  • ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి తనిఖీలు
  • అధికారులకు పలు ఆదేశాలను జారీ చేసిన చంద్రబాబు
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో చంద్రబాబు దడ పుట్టించిన సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం పరిపాలనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి... ఆకస్మిక తనిఖీలకు దూరంగానే ఉన్నారు. ఏడాది క్రితం ఓ సారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఆయన పాత ట్రెండ్ ను కొనసాగించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి విజయవాడలోని పలు ప్రాంతాలను ఆయన తనఖీ చేశారు. గవర్నర్ పేటలోని ఆర్టీసీ-2 డిపో, కంట్రోల్ రూమ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

పాత బస్టాండు వద్ద ఉన్న పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్కు కాల్వ గట్టుపై పచ్చదనం, సుందరీకరణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బస్టాండులోకి వచ్చి తనిఖీలను కొనసాగించారు. ఇదే సమయంలో నగరంలోని పలు అభివృద్ధి పనులను కూడా ఆయన తనిఖీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
Go Back to Shorts
chandrababu
ap cm
chandrababu surprise visits
vijayawada

More Telugu News