: ఎంజీఆర్ మెమోరియల్ హౌస్ కు చేరుకున్న శశికళ
శశికళ వెంటనే లొంగిపోవాల్సిందేనని ఈ రోజు సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయడంతో ఇక చేసేదేమీలేక చిన్నమ్మ బెంగళూరుకు బయలుదేరిన విషయం తెలిసిందే. మొదట చెన్నై మెరీనా బీచ్ సమీపంలో ఉన్న అమ్మ జయలలిత సమాధిని దర్శించుకున్న ఆమె, ఆ తరువాత అక్కడి నుంచి చెన్నైలోని టీనగర్లో ఉన్న ఎంజీఆర్ మెమోరియల్ హౌస్ కు వెళ్లారు. అక్కడ ఎంజీఆర్ చిత్రపటానికి ఆమె నివాళులు అర్పించి, అక్కడే కాసేపు కూర్చున్నారు. అనంతరం టీనగర్ నుంచి బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానానికి ఆమె రోడ్డు మార్గంలో బయలుదేరనున్నారు.