: ప్రతి అంశంలోనూ విపక్షాలపై విమర్శలెందుకు?: చాడ వెంకట్రెడ్డి
మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసులు చేసిన లాఠీచార్జీ పట్ల తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై హైదరాబాద్లో ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశంలోనూ ప్రభుత్వం ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరించొద్దని ఆయన అన్నారు. ప్రాజెక్టులపై నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆయన అన్నారు.