చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్ లు మరియు పేద మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ

చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో  25 పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్ లు  మరియు మహిళా స్వయం సాధికారకలో భాగంగా కుట్టు మిషన్ శిక్షణ పొందినటువంటి 8 మంది మహిళలకు శ్రీ ఇన్ఫో సిస్టం సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో (CSR Funds) ఆదివారం 31-03-2024, ఎస్.వి.ఎస్.ఎస్. నివాస్, TriCAD, Czech Colony ప్రాంగణంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్ లు, కుట్టుమిషన్లు పంపిణీ చేయడం జరిగింది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో మహిళా లోకానికి అండగా నిలవడంలో ప్రతి సేవా సంస్థ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫౌండేషన్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లు ప్రసాద్, రాజశేఖర్ చందు, డాక్టర్ రాఘవయ్య, సంపత్, రమాదేవి, శేషగిరి రావు, సురేష్, మాధవి, నవీన్, రమణి, రషీద్ తదితరులు పాల్గొన్నారు

More Press News