చేనేత కార్మికులకు జ‌గ‌నన్న అండ‌: విజ‌య‌వాడ‌ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి

Related image

విజ‌య‌వాడ‌: కరోనా విజృంభణ నేపథ్యంలో చేనేత కార్మికులకు అండ‌గా వైసీపీ ప్ర‌భుత్వం చేయూతనిచ్చింద‌ని న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. బుధ‌వారం బంద‌రు రోడ్డులోని ర‌ఘ‌వ‌య్య పార్క్ బాపు మ్యూజియంలో స‌హ‌కార సంఘం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ ను మేయ‌ర్ సంద‌ర్శించారు.

అనంత‌రం మేయ‌ర్ మాట్లాడుతూ కరోనా స‌మ‌యంలో ప‌నులు లేక ఇబ్బంది ప‌డుతున్న చేనేత‌, చిరు వ్యాపారుల‌కు అండ‌గా జ‌గ‌నన్న ప్ర‌భుత్వం చేయూత ద్వారా  24వేల రూపాయ‌ల న‌గ‌దు అంద‌జేయ‌డం వారికి చాలా ఉప‌యోగ‌ప‌డిందన్నారు. చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ వ‌చ్చే నెల 12వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. స్టాల్స్‌లో నాణ్య‌మైన చీరాలు, జైపూర్ బెడ్‌షిట్స్‌, ఖాదీ ష‌ట్స్‌, సార‌గ్‌పూర్ పుడ్ ఐట‌మ్స్ బాగున్నాయ‌న్నారు.

More Press Releases