తమిళనాడు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

Related image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి యం.కె. స్టాలిన్ ను ఆదివారం చెన్నైలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ కు గవర్నర్ రాజ్ భవన్ లో పండించిన మామిడి ఫలాలను అందజేశారు. ఈ సందర్భంగా పాండిచ్చేరి ఎయిర్ పోర్టుకు 200 ఎకరాల స్థలం కేటాయించి పాండిచ్చేరి ఎయిర్ పోర్టు విస్తరణకు సహకరించాలని కోరారు. ఈ ఎయిర్ పోర్టు తమిళనాడు సరిహద్దు జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగమని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కేంద్రమంత్రి టి.ఆర్. బాలు కూడా పాల్గొన్నారు.

More Press Releases