మంత్రి లోకేశ్తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ
- ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంతెన
- ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా ఇటీవల నియామకం
- మంతెన సేవలను ప్రశంసించిన మంత్రి లోకేశ్
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు, ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు సోమవారం నాడు మంత్రి నారా లోకేశ్తో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని తెలుస్తోంది.
ఇటీవల మంతెన సత్యనారాయణ రాజును రాష్ట్ర ప్రభుత్వం యోగా, నేచురోపతి విభాగం గౌరవ సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రి లోకేశ్ను కలిశారు.
ఈ సందర్భంగా ప్రకృతి వైద్య రంగంలో దశాబ్దాలుగా మంతెన అందిస్తున్న సేవలను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజారోగ్యం కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.
ఇటీవల మంతెన సత్యనారాయణ రాజును రాష్ట్ర ప్రభుత్వం యోగా, నేచురోపతి విభాగం గౌరవ సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రి లోకేశ్ను కలిశారు.
ఈ సందర్భంగా ప్రకృతి వైద్య రంగంలో దశాబ్దాలుగా మంతెన అందిస్తున్న సేవలను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజారోగ్యం కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.