KTR: కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్.. ఒకే టేబుల్పై భోజనం, రెండు గంటలకు పైగా సమాలోచనలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ముగ్గురు సరదాగా మాట్లాడుకున్నారు. మంగళవారం అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఒకే టేబుల్పై భోజనం చేశారు. ఆ తర్వాత అక్కడే చాలాసేపు వారు మాట్లాడుకున్నారు. రెండు గంటలకు పైగా వారి మధ్య సంభాషణలు జరగడం గమనార్హం. మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీజేపీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఒకే టేబుల్పై భోజనం చేశారు. ఆ తర్వాత అక్కడే చాలాసేపు వారు మాట్లాడుకున్నారు. రెండు గంటలకు పైగా వారి మధ్య సంభాషణలు జరగడం గమనార్హం. మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది.