HDFC Bank: ఏప్రిల్ 1 నుంచి బ్యాంకు ఏటీఎమ్, యూపీఐ వాడకంలో కీలక మార్పులు!
ఏప్రిల్ 1వ తేదీ నుంచి పలు బ్యాంకులు తమ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఏటీఎమ్ నగదు ఉపసంహరణ, యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వంటివి తమ కస్టమర్ల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రకటించాయి. ఈ మార్పుల గురించి వినియోగదారులు ముందే తెలుసుకోవడం ద్వారా అనవసర చార్జీలను నివారించుకోవచ్చు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఏటీఎమ్ లావాదేవీల లెక్కింపు విధానంలో మార్పు చేసింది. ఇప్పటివరకు డెబిట్ కార్డు ద్వారా ఏటీఎమ్లో తీసిన నగదును మాత్రమే ఉచిత లావాదేవీల పరిమితిలో లెక్కించేవారు. కానీ ఏప్రిల్ 1 నుంచి యూపీఐ యాప్ల ద్వారా చేసే నగదు ఉపసంహరణలను కూడా ఈ కోటాలోనే పరిగణిస్తారు. హెచ్డీఎఫ్సీ ఏటీఎమ్లలో నెలకు 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎమ్లలో (మెట్రోలలో 3, నాన్-మెట్రోలలో 5) ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.23తో పాటు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. రిస్క్ మేనేజ్ మెంట్, కార్డుల వినియోగం తీరు తెన్నుల్లో ఏకీకృత విధానం కోసం ఈ మార్పులు చేసినట్లు సమాచారం. తాజా రూల్స్ ప్రకారం.. పీఎన్బీ కస్టమర్లు తమ డెబిట్ కార్డు రకాన్ని బట్టి రోజుకు గరిష్ఠంగా రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకూ నగదును తీసుకోవచ్చు. గతంలో 1 లక్షల వరకూ నగదు ఉపసంహరణకు అనుమతి ఉన్న కార్డుల పరిమితిలో కూడా కోత పడింది.
ఇక జియో పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద నగదు తీసుకునే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అలాగే, ఏప్రిల్ 1 నుంచి రూపే ప్లాటినం డెబిట్ కార్డులపై ఉచిత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే, వినియోగదారులు నిర్దేశిత మొత్తంలో ఖర్చు చేయాలనే కొత్త నిబంధనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, కస్టమర్లు తమ బ్యాంకుల తాజా నిబంధనలను తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించడం మంచిది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఏటీఎమ్ లావాదేవీల లెక్కింపు విధానంలో మార్పు చేసింది. ఇప్పటివరకు డెబిట్ కార్డు ద్వారా ఏటీఎమ్లో తీసిన నగదును మాత్రమే ఉచిత లావాదేవీల పరిమితిలో లెక్కించేవారు. కానీ ఏప్రిల్ 1 నుంచి యూపీఐ యాప్ల ద్వారా చేసే నగదు ఉపసంహరణలను కూడా ఈ కోటాలోనే పరిగణిస్తారు. హెచ్డీఎఫ్సీ ఏటీఎమ్లలో నెలకు 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎమ్లలో (మెట్రోలలో 3, నాన్-మెట్రోలలో 5) ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.23తో పాటు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. రిస్క్ మేనేజ్ మెంట్, కార్డుల వినియోగం తీరు తెన్నుల్లో ఏకీకృత విధానం కోసం ఈ మార్పులు చేసినట్లు సమాచారం. తాజా రూల్స్ ప్రకారం.. పీఎన్బీ కస్టమర్లు తమ డెబిట్ కార్డు రకాన్ని బట్టి రోజుకు గరిష్ఠంగా రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకూ నగదును తీసుకోవచ్చు. గతంలో 1 లక్షల వరకూ నగదు ఉపసంహరణకు అనుమతి ఉన్న కార్డుల పరిమితిలో కూడా కోత పడింది.
ఇక జియో పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద నగదు తీసుకునే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అలాగే, ఏప్రిల్ 1 నుంచి రూపే ప్లాటినం డెబిట్ కార్డులపై ఉచిత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే, వినియోగదారులు నిర్దేశిత మొత్తంలో ఖర్చు చేయాలనే కొత్త నిబంధనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, కస్టమర్లు తమ బ్యాంకుల తాజా నిబంధనలను తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించడం మంచిది.