Dola Sri Balaveeranjaneya Swamy: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Government Good News for Village Ward Secretariat Employees
  • ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇస్తామని మంత్రి డోలా హామీ
  • అసెంబ్లీలో ప్రకటన
  • పర్యవేక్షణ కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించింది. అదే సమయంలో, గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను 'స్వర్ణ గ్రామం', 'స్వర్ణ వార్డు' కార్యాలయాలుగా మారుస్తూ శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. 

బుధవారం శాసన మండలిలో ఈ బిల్లు ఆమోదం సందర్భంగా రాష్ట్ర స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడారు. ఈ కొత్త కార్యాలయాల ద్వారా 'స్వర్ణాంధ్ర' సాధనకు కృషి చేస్తామని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యాలయాల పర్యవేక్షణ కోసం మూడంచెల వ్యవస్థను తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండేదని, కూటమి ప్రభుత్వంలో దానిని పటిష్ఠం చేస్తున్నామని మంత్రి వివరించారు. కూటమి పాలనలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని డోలా అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. తాము ఆ నిధులను విడుదల చేశామని తెలిపారు.
 
Dola Sri Balaveeranjaneya Swamy
AP Government
Grama Sachivalayam
Wards Sachivalayam
Swarna Gramam
Swarna Ward
Andhra Pradesh
AP Sachivalayam Employees
AP Promotions
Panchayat Funds

More Telugu News