భారత్లో బంగ్లాదేశ్ వంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి: ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి
- బంగ్లాదేశ్ పరిణామాలు మనకు హెచ్చరిక అన్న ధీరేంద్ర శాస్త్రి
- హిందువులు ఐక్యంగా ఉండాలన్న ధీరేంద్ర శాస్త్రి
- ఐక్యంగా లేకుంటే మన రోడ్లు బంగ్లాదేశ్లో వంటి పరిస్థితులు చూస్తాయని వ్యాఖ్య
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, "భారత ప్రజలకు నేను ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. మన దేశంలో బంగ్లాదేశ్ లాంటి దుస్థితి రాకూడదనుకుంటే ఇది సరైన సమయం. నేడు హిందువులంతా ఐక్యంగా ఉండకపోతే, ఛత్తీస్గఢ్ రోడ్లు సైతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసే రోజు ఎంతో దూరంలో లేదు" అని హెచ్చరించారు.
మరో ఆధ్యాత్మిక గురువు జగద్గురు రాంభద్రాచార్య కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణాలపై ప్రజలు మౌనంగా ఉండకూడదని ఆయన సూచించారు.
"మనం ఇకపై మౌనంగా ఉండకూడదు. హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి, ఈ దారుణాలకు గట్టిగా ప్రతిస్పందించాలి" అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న హింసకు సంబంధించి ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీ మరణం తరువాత బంగ్లాదేశ్లో అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే.