Chandrababu Naidu: శంషాబాద్లోని కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్న సీఎం చంద్రబాబు
- శంషాబాద్లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్న సీఎం చంద్రబాబు
- ఆశ్రమ అధ్యక్షులు దాజీతో సమావేశమై పలు కేంద్రాలను పరిశీలన
- పర్యటన అనంతరం హెలికాప్టర్లో అమరావతికి తిరుగుపయనం
- సాయంత్రం విజయవాడలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమానికి హాజరు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో ఉన్న ప్రఖ్యాత కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆశ్రమ అధ్యక్షులు కమలేష్ డి. పటేల్ (దాజీ)తో సమావేశమవుతారు. అనంతరం విజయవాడలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈరోజు ఉదయం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి, 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకుంటారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన ఆశ్రమంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వెల్నెస్, మెడిటేషన్, యోగా కేంద్రాలతో పాటు ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియం, హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి సందర్శిస్తారు. సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శ్రీరామచంద్ర మిషన్ 1400 ఎకరాల విస్తీర్ణంలో కన్హా శాంతి వనాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ ఆశ్రమం, 8 లక్షలకు పైగా వృక్ష జాతులతో జీవవైవిధ్య కేంద్రంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దాజీ నేతృత్వంలో ఇక్కడ హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నారు.
కన్హా పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్లో అమరావతికి తిరిగి వస్తారు. మధ్యాహ్నం సచివాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించి, సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈరోజు ఉదయం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి, 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకుంటారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన ఆశ్రమంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వెల్నెస్, మెడిటేషన్, యోగా కేంద్రాలతో పాటు ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియం, హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి సందర్శిస్తారు. సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శ్రీరామచంద్ర మిషన్ 1400 ఎకరాల విస్తీర్ణంలో కన్హా శాంతి వనాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ ఆశ్రమం, 8 లక్షలకు పైగా వృక్ష జాతులతో జీవవైవిధ్య కేంద్రంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దాజీ నేతృత్వంలో ఇక్కడ హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నారు.
కన్హా పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్లో అమరావతికి తిరిగి వస్తారు. మధ్యాహ్నం సచివాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించి, సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొంటారు.