Hyderabad dog attack: హైదరాబాద్లో బాలుడిపై వీధి కుక్కల దాడి.. నివేదిక కోరిన మానవ హక్కుల కమిషన్
- హయత్ నగర్ శివగంగా కాలనీలో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
- దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న కమిషన్
- నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
హైదరాబాద్లో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నగర శివారులోని హయత్ నగర్ శివగంగా కాలనీలో ప్రేమ్చంద్ అనే ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి.
ఈ ఘటనకు సంబంధించి పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 29వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, బాలుడి ప్రస్తుత పరిస్థితి, కుక్కల స్టెరిలైజేషన్, నియంత్రణ చర్యల స్థితిగతులను నివేదికలో పేర్కొనాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలు తీరుపై సమగ్ర నివేదిక అందజేయాలని కోరింది.
ఈ ఘటనకు సంబంధించి పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 29వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, బాలుడి ప్రస్తుత పరిస్థితి, కుక్కల స్టెరిలైజేషన్, నియంత్రణ చర్యల స్థితిగతులను నివేదికలో పేర్కొనాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలు తీరుపై సమగ్ర నివేదిక అందజేయాలని కోరింది.