RO-KO: వన్డే సిరీస్పై గురి.. నెట్స్లో చెమటోడ్చుతున్న కోహ్లీ, రోహిత్.. ఇదిగో వీడియో!
- టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత వన్డే సిరీస్పై టీమిండియా దృష్టి
- రాంచీలో నెట్స్లో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ, రోహిత్ శర్మ
- గాయాల కారణంగా గిల్, శ్రేయస్ అయ్యర్ దూరం.. సీనియర్లపైనే భారం
టెస్ట్ సిరీస్లో ఎదురైన ఘోర పరాభవాన్ని పక్కనపెట్టి, దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్లో సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జట్టులోని సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రాంచీలో నెట్ ప్రాక్టీస్ ప్రారంభించారు. టెస్టుల్లో 0-2 తేడాతో వైట్వాష్కు గురైన భారత జట్టుకు ఈ ఇద్దరు అనుభవజ్ఞుల రాక కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇద్దరూ కలిసి నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల్లో ఇది కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. శుభ్మన్ గిల్ (మెడ గాయం), శ్రేయస్ అయ్యర్ (ప్లీహం గాయం) వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో కోహ్లీ, రోహిత్లపై బాధ్యత మరింత పెరిగింది. జట్టు బ్యాటింగ్ భారాన్ని ఈ అనుభవజ్ఞులే మోయాల్సి ఉంది.
ఇదే సమయంలో వన్డే సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తిరిగి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం జట్టుకు సానుకూలాంశం. ఎల్లుండి తొలి వన్డే జరగనుంది. అయితే, ఈ సిరీస్లో భారత్ పుంజుకోవాలంటే సీనియర్ల ప్రదర్శన కీలకం కానుంది.
ఇద్దరూ కలిసి నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల్లో ఇది కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. శుభ్మన్ గిల్ (మెడ గాయం), శ్రేయస్ అయ్యర్ (ప్లీహం గాయం) వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో కోహ్లీ, రోహిత్లపై బాధ్యత మరింత పెరిగింది. జట్టు బ్యాటింగ్ భారాన్ని ఈ అనుభవజ్ఞులే మోయాల్సి ఉంది.
ఇదే సమయంలో వన్డే సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తిరిగి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం జట్టుకు సానుకూలాంశం. ఎల్లుండి తొలి వన్డే జరగనుంది. అయితే, ఈ సిరీస్లో భారత్ పుంజుకోవాలంటే సీనియర్ల ప్రదర్శన కీలకం కానుంది.