Afghanistan: పాకిస్థాన్కు భారీ షాక్.. భారత్తో ఆఫ్ఘనిస్థాన్ 100 మిలియన్ డాలర్ల ఒప్పందం
- పాకిస్థాన్కు భారీ దెబ్బగా మారిన తాలిబన్ల నిర్ణయం
- భారత ఫార్మా సంస్థ జైడస్ లైఫ్సైన్సెస్ కీలక పాత్ర
- ఆఫ్ఘనిస్థాన్లో మందుల తయారీకి జైడస్ ప్రణాళికలు
- తాలిబన్ మంత్రి భారత పర్యటన తర్వాత వేగంగా కుదిరిన డీల్
భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఆర్థిక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల ఫార్మా కంపెనీల మధ్య 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 830 కోట్లు) విలువైన కీలక ఒప్పందం కుదిరింది. ఈ పరిణామం పాకిస్థాన్ ప్రాంతీయ వాణిజ్య ప్రాబల్యానికి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. తాలిబన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ ఇటీవల భారత్లో పర్యటించి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరిన కొన్ని రోజులకే ఈ ఒప్పందం జరగడం గమనార్హం.
దుబాయ్లోని ఆఫ్ఘన్ కాన్సులేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ లైఫ్సైన్సెస్, ఆఫ్ఘనిస్థాన్కు చెందిన రోఫీస్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మధ్య ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం జైడస్ లైఫ్సైన్సెస్ తొలుత ఆఫ్ఘనిస్థాన్కు ఔషధాలను ఎగుమతి చేస్తుంది. ఆ తర్వాత, తమ కార్యాలయాన్ని అక్కడికి తరలించి, దేశీయంగానే మందుల ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ఒప్పందం ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, నాణ్యత లేని దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఆఫ్ఘన్ కాన్సులేట్ ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇది ఒక నమూనా అని ఆఫ్ఘన్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల తాలిబన్లు పాకిస్థాన్తో ఫార్మా వాణిజ్యాన్ని నిషేధించారు. మూడు నెలల్లోగా పాకిస్థానీ సరఫరాదారులతో సంబంధాలు తెంచుకోవాలని తమ కంపెనీలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో భారత్తో కుదిరిన తాజా ఒప్పందం, పాకిస్థాన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
దుబాయ్లోని ఆఫ్ఘన్ కాన్సులేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ లైఫ్సైన్సెస్, ఆఫ్ఘనిస్థాన్కు చెందిన రోఫీస్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మధ్య ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం జైడస్ లైఫ్సైన్సెస్ తొలుత ఆఫ్ఘనిస్థాన్కు ఔషధాలను ఎగుమతి చేస్తుంది. ఆ తర్వాత, తమ కార్యాలయాన్ని అక్కడికి తరలించి, దేశీయంగానే మందుల ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ఒప్పందం ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, నాణ్యత లేని దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఆఫ్ఘన్ కాన్సులేట్ ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇది ఒక నమూనా అని ఆఫ్ఘన్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల తాలిబన్లు పాకిస్థాన్తో ఫార్మా వాణిజ్యాన్ని నిషేధించారు. మూడు నెలల్లోగా పాకిస్థానీ సరఫరాదారులతో సంబంధాలు తెంచుకోవాలని తమ కంపెనీలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో భారత్తో కుదిరిన తాజా ఒప్పందం, పాకిస్థాన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.