ఆస్ట్రేలియా బాటలో మరో దేశం.. పిల్లలకు సోషల్ మీడియాపై కీలక నిర్ణయం!
- పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఉక్కుపాదం దిశగా మలేషియా
- 16 ఏళ్ల లోపు వారికి నిషేధం విధించాలని ప్లాన్
- ఈ విషయంలో ఆస్ట్రేలియాను ఆదర్శంగా తీసుకుంటున్న ప్రభుత్వం
వచ్చే ఏడాది నాటికి 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధించే ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేస్తున్నామని, పిల్లల భవిష్యత్తును కాపాడటంలో ప్రభుత్వం, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని ఫాహ్మి ఫడ్జిల్ అన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో మలేషియా ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పర్యవేక్షణను కఠినతరం చేసింది. సెప్టెంబర్లో వెలువడిన ఇప్సోస్ మలేషియా సర్వేలో 72 శాతం మంది ప్రజలు పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయడాన్ని సమర్థించడం గమనార్హం.
మరోవైపు, ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సంస్థలు 16 ఏళ్ల లోపు వయసున్న వారి ఖాతాలను తొలగించాలి. లేనిపక్షంలో భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే తరహాలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి పలు యూరోపియన్ దేశాలు కూడా పిల్లలను ఆన్లైన్ హానికర కంటెంట్ నుంచి రక్షించేందుకు వయోపరిమితి నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి.