విశాఖ అభివృద్ధిపై జాతీయ మీడియాలో కథనం... సీఎం చంద్రబాబు స్పందన
- విశాఖ అభివృద్ధిపై హిందుస్థాన్ టైమ్స్ కథనం
- జాతీయ మీడియా కథనంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
- తూర్పు తీరానికి వైజాగ్ను ఆర్థిక ఇంజిన్గా మారుస్తామన్న సీఎం
- ప్రతీ భారతీయుడు గర్వపడే గ్లోబల్ నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని వెల్లడి
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగంగా విస్తరిస్తున్న టెక్ రంగం, ఏఎంటీజెడ్ (AMTZ) నాయకత్వంలోని మెడ్-టెక్ హబ్, అద్భుతమైన సహజ సౌందర్యం కలగలిపి విశాఖలో అనంతమైన అవకాశాలకు తలుపులు తెరుస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. గూగుల్ ఏఐ పెట్టుబడుల నుంచి అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ల వరకు, హిల్-టెక్ క్యాంపస్ల నుంచి కొత్త ఎయిర్పోర్ట్, మెట్రో రైల్ నిర్మాణం వరకు ప్రతీ అంశం వైజాగ్ ప్రగతికి నిదర్శనమని ఆయన వివరించారు.
లక్ష్యంతో కూడిన పాలన, ప్రజల ఆకాంక్షలు కలిస్తే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో విశాఖ నగరం నిరూపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు తీరానికి వైజాగ్ను ఆర్థిక, ఆవిష్కరణల కేంద్రంగా (ఇంజిన్గా) మార్చడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతీ భారతీయుడు గర్వపడేలా వైజాగ్ను ఒక గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.