తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం.. వీడియో ఇదిగో!
- కొండ పైనుంచి పడిన రాయి.. బైకర్ కు తీవ్రగాయాలు
- గాయపడిన వ్యక్తి లగేజి సెంటర్లో వెండార్ గా పనిచేసే లోకేశ్ గా గుర్తింపు
- సోమవారం రాత్రి నుంచి తిరుమలలో వర్షం
వర్షం కారణంగా కొండ పైనుంచి పడుతున్న రాళ్లు
మంగళవారం డ్యూటీకి బయలుదేరిన లోకేశ్.. రెండో ఘాట్ రోడ్డులో హరిణి ప్రాంతం దగ్గర ప్రమాదానికి గురయ్యాడు. వర్షం కారణంగా కొండ పైనుంచి ఓ రాయి దొర్లుకుంటూ వచ్చి మీద పడింది. దీంతో లోకేశ్ బైక్ పైనుంచి కిందపడ్డాడు. అతడి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు అంబులెన్స్ కు ఫోన్ చేసి లోకేశ్ ను ఆసుపత్రికి తరలించారు. లోకేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని స్విమ్స్ వైద్యులు తెలిపారు.