కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్పై బీజేపీ వేటు.. పార్టీ నుంచి సస్పెన్షన్
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణ
- బీహార్ ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజే చర్యలు తీసుకోవడంపై చర్చ
- ఎన్డీయే, నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు వేటు
కొంతకాలంగా ఆర్కే సింగ్ ఎన్డీయే నాయకత్వంపైనా, బీహార్లోని నితీశ్ కుమార్ ప్రభుత్వంపైనా తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. "మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లింది. అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలి" అని బీజేపీ జారీ చేసిన నోటీసులో స్పష్టం చేసింది.
గతంలో దౌత్యవేత్తగా, మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర హోం సెక్రటరీగా పనిచేసిన ఆర్కే సింగ్, 2013లో బీజేపీలో చేరారు. బీహార్లోని ఆరా లోక్సభ స్థానం నుంచి 2014, 2019లలో రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2017లో మోదీ కేబినెట్లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.