ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుమారుడి పెళ్లి రిసెప్షన్కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
- మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుమారుడి వివాహ విందు
- హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
- పల్నాడు జిల్లా వెల్దుర్తిలో జరిగిన వేడుక
- నూతన వధూవరులు గౌతమ్ రెడ్డి, తేజస్వినిలకు ఆశీర్వాదం
సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం కోసం వెలగపూడి సచివాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వెల్దుర్తికి చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం నేరుగా కల్యాణ మండపంలోని వేదిక వద్దకు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దంపతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నూతన దంపతుల జీవితం సుఖసౌక్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. ఈ వివాహ వేడుకకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి తిరిగి హెలికాప్టర్లో వెలగపూడికి బయలుదేరి వెళ్లారు.


