రేపు 'సినీ కార్మికుల' అభినందన సభ.. హాజరుకానున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy to Attend Cine Karmikula Sabha Tomorrow
  • సాయంత్రం నాలుగు గంటలకు 'సినీ కార్మికుల' అభినందన సభ
  • యూసుఫ్‌గూడ పోలీస్ మైదానంలో జరగనున్న సభ
  • కార్యక్రమానికి హాజరు కానున్న సినీ పెద్దలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు యూసుఫ్‌గూడలో సినీ కార్మికుల అభినందన సభలో పాల్గొననున్నారు. ఈ సభ రేపు సాయంత్రం నాలుగు గంటలకు యూసుఫ్‌గూడ పోలీస్ మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

ఇదిలా ఉండగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31న సాయంత్రం 7 గంటలకు వెంగళరావునగర్, సాయంత్రం 8 గంటలకు సోమాజిగూడలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తారు.

నవంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బోరబండ, సాయంత్రం 8 గంటలకు ఎర్రగడ్డలో ప్రచారం ఉంటుంది. నవంబర్ 4న సాయంత్రం 7 గంటలకు షేక్‌పేట, సాయంత్రం 8 గంటలకు రహమత్ నగర్‌లో ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి.

నవంబర్ 5న సాయంత్రం 7 గంటలకు షేక్‌పేట, సాయంత్రం 8 గంటలకు యూసుఫ్‌గూడలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.

నవంబర్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య 6 డివిజన్‌లలో మోటార్ సైకిల్ ర్యాలీ, నవంబర్ 9న ఉదయం 10 గంటలకు షేక్‌పేటలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana CM
Cine Karmikula Sabha
Yousufguda
Jubilee Hills Election
Telangana Politics

More Telugu News