Chandrababu Naidu: 'నంద గోకులం'లో మెరికల్లాంటి విద్యార్థులను కలవడం ఆనందం కలిగించింది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu happy to meet students at Nanda Gokulam
షార్ట్స్‌లో చూడండి
నిరుపేద బాలుర భవిష్యత్తుకు బాటలు వేసే లక్ష్యంతో నెల్లూరులో ఏర్పాటు చేసిన 'నంద గోకులం లైఫ్ స్కూల్' (ఎన్‌జీఎల్‌ఎస్‌) శుక్రవారం ప్రారంభమైంది. ఈ స్ఫూర్తిదాయక విద్యాసంస్థను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించి, విద్యార్థులతో ముచ్చటించారు.

"నెల్లూరులోని నంద గోకులం లైఫ్ స్కూల్ (ఎన్‌జీఎల్‌ఎస్‌)లో ప్రతిభావంతులైన యువ ఛాంపియన్లను కలవడం ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తిదాయకమైన సంస్థను ఈరోజు ప్రారంభించే అదృష్టం నాకు లభించింది. విశ్వ సముద్ర గ్రూప్ మద్దతుతో చింతా శశిధర్ ఫౌండేషన్ చొరవతో, ఎన్‌జీఎల్‌ఎస్‌ అనేది నిరుపేద బాలల కోసం ఏర్పాటైన ఒక ఉచిత రెసిడెన్షియల్ పాఠశాల. ఇది సమగ్ర జీవిత నైపుణ్యాలు, సమకాలీన పరిస్థితుల అధ్యయనం, మరియు వృత్తిపరమైన సంసిద్ధతపై దృష్టి పెడుతుంది. ఈ విద్యాసంస్థ వ్యవస్థాపకులను అభినందిస్తున్నాను... రేపటి నాయకులను రూపొందించినందుకు ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. 

చింతా శశిధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, విశ్వ సముద్ర గ్రూప్ సహకారంతో ఈ పాఠశాలను నెలకొల్పారు. ఇది పూర్తిగా నిరుపేద బాలుర కోసం ఉద్దేశించిన ఉచిత రెసిడెన్షియల్ పాఠశాల. కేవలం చదువుకే పరిమితం కాకుండా, విద్యార్థులకు సమగ్ర జీవిత నైపుణ్యాలు, ఆచరణాత్మక జ్ఞానం, వృత్తిపరమైన శిక్షణ అందించడమే ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Nanda Gokulam Life School
Nellore
Chinta Shashidhar Foundation
Viswa Samudra Group
Free residential school
Education for poor children
Life skills training
Andhra Pradesh education
CM Chandrababu

More Telugu News