లండన్లో గుండెపోటుతో జగిత్యాల యువకుడి మృతి
- జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, దమ్మన్నపేటకు చెందిన మహేందర్ రెడ్డి మృతి
- రెండేళ్ల క్రితం పీజీ చేసేందుకు లండన్ వెళ్లిన మహేందర్ రెడ్డి
- ఇటీవల పీజీ పూర్తి చేసుకొని, వర్క్ వీసా పొందిన మహేందర్ రెడ్డి
మహేందర్ రెడ్డి తండ్రి కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ విషాదకర ఘటనపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి అకాల మరణంతో దమ్మన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.