'మిరాయ్' దసరా కానుక.. టిక్కెట్ ధరలు తగ్గిస్తూ కీలక ప్రకటన
- ఇప్పటి వరకు రూ. 140 కోట్లకు పైగా వసూలు చేసిన మిరాయ్
- చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు నిర్ణయం
- సింగిల్ స్క్రీన్ టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం
ఈ నేపథ్యంలో, ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర బృందం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
"ఈ దసరాను మీ కుటుంబంతో, పిల్లలతో కలిసి 'మిరాయ్' సినిమాను థియేటర్లలో చూడండి. సింగిల్ స్క్రీన్లలో అతి తక్కువ ధరకే చిత్రాన్ని ఆస్వాదించండి" అని చిత్ర బృందం పేర్కొంది. బాల్కనీ టిక్కెట్ ధరను రూ. 150, ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరను రూ. 105గా నిర్ణయించారు.