మంగళవారం నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం
- మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం
- రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్ష సూచన
- అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వానలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
ఈ ఆవర్తనం ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడనుందని, దీని ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.