Narendra Modi: బుల్లెట్ రైల్లో జపాన్ ప్రధానితో మోదీ ఫొటోలు ఇవిగో!

Narendra Modi Travels by Bullet Train with Japan PM
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. టోక్యో నుంచి సెందాయ్ నగరానికి వారు ఈ హై-స్పీడ్ రైలులో పయనించారు. ఈ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెండు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్లిన ప్రధాని మోదీ, భారత్-జపాన్ 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్ల తయారీ, వాణిజ్య పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఆయన పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో, పెట్టుబడిదారులతో మోదీ సమావేశమవుతున్నారు.

జపాన్ పర్యటన ముగిసిన వెంటనే ప్రధాని మోదీ చైనాకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు చైనాలో పర్యటించనున్న ఆయన, రేపు 31న బీజింగ్‌లో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 1న తియాన్జిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు హాజరవుతారు.

ఈ చైనా పర్యటనకు దౌత్యపరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా లడఖ్ సరిహద్దుల్లో ఘర్షణల తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తిరిగి బలోపేతం చేసేందుకు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ కీలకం కానుంది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న తరుణంలో, మోదీ చైనా పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. 




Go Back to Shorts
Narendra Modi
Japan visit
Shinzo Abe
Bullet train
India Japan summit
China visit
Xi Jinping
SCO summit
Artificial Intelligence
Semiconductors

More Telugu News