ఎస్ఎల్బీసీ సొరంగం కోసం కీలక నియామకం.. ఇరిగేషన్ శాఖకు కొత్త సలహాదారు
- తెలంగాణ ఇరిగేషన్ శాఖకు కొత్త సలహాదారు నియామకం
- రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్కు కీలక బాధ్యతలు
- రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న హర్ పాల్ సింగ్
- ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి
- నియామక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం హర్ పాల్ సింగ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లను అధిగమించి, పనులను సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోనుంది.