కాళేశ్వరంపై నివేదిక తప్పులతడక: మాధవరం కృష్ణారావు
- కాళేశ్వరంపై విచారణ కమిటీ నివేదికపై మాధవరం విమర్శలు
- కేసీఆర్, హరీశ్ లను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపాటు
- రెండు పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శ
కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారని, కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని కృష్ణారావు విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఇంజినీర్లు, కార్మికులు మృతి చెందిన ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో కుంగిన పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.