Narendra Modi: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం... సంతకాలు చేసిన ఇరుదేశాలు
- స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం
- మోదీ, కీర్ స్మార్టర్ సమక్షంలో సంతకాలు చేసిన వాణిజ్య శాఖల మంత్రులు
- ఇరు దేశాల మధ్య 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా
భారత్, బ్రిటన్ దేశాలు చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ సమక్షంలో ఇరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
దీని ద్వారా భారత్ - బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. యూకేలో ఆయన రెండు రోజులు పర్యటిస్తారు. జులై 25, 26 తేదీల్లో మాల్దీవులలో పర్యటిస్తారు.
దీని ద్వారా భారత్ - బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. యూకేలో ఆయన రెండు రోజులు పర్యటిస్తారు. జులై 25, 26 తేదీల్లో మాల్దీవులలో పర్యటిస్తారు.