Hindu Raksha Dal: ఆ సమయంలో శాకాహారమే విక్రయించాలి... ఘజియాబాద్ కేఎఫ్‌సీ వద్ద హిందూ రక్ష దళ్ నిరసన

Hindu Raksha Dal Protest at KFC Ghaziabad over Non Veg Sales during Kanwar Yatra
షార్ట్స్‌లో చూడండి
హిందువులకు పరమ పవిత్రమైన కాంవర్ (కావడి) యాత్ర సమయంలో నాన్-వెజ్ ఆహార విక్రయాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ హిందూ రక్షా దళ్ సభ్యులు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లోని కేఎఫ్‌సీ రెస్టారెంట్ వద్ద నిరసన తెలిపారు. కాంవర్ యాత్ర సమయంలో ఘజియాబాద్‌లోని అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో శాఖాహార ఆహారం మాత్రమే అందించాలని ఈ సంస్థ సభ్యులు  కోరారు. 

ఈ పవిత్ర యాత్ర సమయంలో నాన్-వెజ్ ఆహారం విక్రయించడం మతపరమైన సెంటిమెంట్స్‌ను గాయపరుస్తుందని హిందూ రక్షా దళ్ నాయకులు వాదించారు. వారు స్థానిక అధికారులను కలిసి, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. కాంవర్ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం, ఈ సమయంలో శాఖాహార ఆహారం మాత్రమే తీసుకోవడం సంప్రదాయంగా ఉందని వారు పేర్కొన్నారు. అందుకు రెస్టారెంట్ యాజమాన్యాలు కూడా సహకరించాలని స్పష్టం చేశారు.

కాంవర్ యాత్ర గురించి... 
కాంవర్ యాత్ర అనేది హిందూ మతంలోని శైవ భక్తులు చేపట్టే ఒక పవిత్రమైన యాత్ర, ఇది సాధారణంగా శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు (కాంవరియాలు) గంగా నది నుండి పవిత్ర జలాన్ని సేకరించి, దానిని కావడిలో రెండు కుండలలో ఉంచి భుజాలపై మోస్తూ నడుస్తారు. ఈ జలాన్ని వారు తమ సమీప శివాలయాలలో శివలింగంపై అభిషేకం చేయడానికి తీసుకెళతారు. ఈ యాత్ర ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా నిర్వహిస్తుంటారు.
Go Back to Shorts
Hindu Raksha Dal
Kanwar Yatra
KFC
Ghaziabad
Uttar Pradesh
Vegetarian Food
Non-Veg Ban
Hindu Sentiments
Shravan Month
Lord Shiva

More Telugu News