Akhil: మైనర్‌పై అత్యాచారం: యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు

Akhil Sentenced to 20 Years in POCSO Case in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా, బాధితురాలికి భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

2016లో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అఖిల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక గర్భవతి కావడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ పక్షాన వాదనలు బలంగా వినిపించారు. బాధితురాలి వాంగ్మూలం, కీలకమైన వైద్య నివేదికలు, ఇతర సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం, అఖిల్‌ను దోషిగా నిర్ధారిస్తూ అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 8 లక్షల పరిహారం అందించాలని తీర్పులో స్పష్టం చేసింది.
Go Back to Shorts
Akhil
Hyderabad
POCSO Act
Minor Girl Rape Case
Nampally Court
Old City Hyderabad
Telangana Crime

More Telugu News