ఆసుపత్రి నుంచే కేసీఆర్ రాజకీయ సమీక్ష.. ప్రజా సమస్యలపై నేతలతో చర్చ
- వైద్య పరీక్షల కోసం యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్
- పరామర్శకు వచ్చిన నేతలతో ప్రజా సమస్యలపై చర్చ
- రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, సాగునీటిపై ప్రధానంగా ఆరా
- యూరియా కొరత, బనకచర్ల అంశంపై నేతల నుంచి ఫీడ్బ్యాక్
- సమావేశంలో కేటీఆర్, హరీశ్రావు సహా పలువురు ముఖ్య నేతలు
ఆయనను పరామర్శించేందుకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఆసుపత్రికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన కేసీఆర్, రాష్ట్రంలోని రైతుల ఇబ్బందులు, వ్యవసాయ రంగంలోని సంక్షోభం, సాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఆరా తీశారు.
ముఖ్యంగా, రైతులకు యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందని, బనకచర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని పలువురు నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. నేతలు వెల్లడించిన క్షేత్రస్థాయి వివరాలను కేసీఆర్ ఓపికగా విన్నారు. ప్రస్తుత పరిణామాలపై వారి నుంచి అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.