Mahesh Kumar Goud: మళ్లీ 90 సీట్లతో మాదే అధికారం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ధీమా

Mahesh Kumar Goud Confident of Congress Winning 90 Seats Again
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మళ్లీ 90 స్థానాల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, దాంతోనే ప్రజల మద్దతు తమకు లభిస్తుందని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శుక్రవారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని చెప్పడానికి పదవుల పంపణీనే నిదర్శనమని అన్నారు. అగ్రవర్ణ నేతకు ముఖ్యమంత్రి పదవి, బీసీ వర్గానికి చెందిన తనకు పీసీసీ అధ్యక్ష పదవి, నలుగురు దళితులకు మంత్రివర్గంలో స్థానం, మరో దళిత నేతకు స్పీకర్ పదవి ఇవ్వడమే దీనికి నిదర్శనమని ఆయన వివరించారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా 'సామాజిక న్యాయ సమరభేరి' పేరిట భారీ సభను నిర్వహించనున్నట్లు మహేశ్ గౌడ్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులకు ఆయన దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. పార్టీ కొత్తగా పదవులు ఇచ్చిన నేతలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Mahesh Kumar Goud
Telangana Congress
TPCC Chief
Telangana Elections
Social Justice

More Telugu News