Puri Jagannath: పూరీ జగన్నాథుడి రథయాత్రలో 600 మందికి అస్వస్థత.. వీడియో ఇదిగో!

Puri Jagannath Rath Yatra 600 Fall Ill Due to Heat
షార్ట్స్‌లో చూడండి
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో శుక్రవారం జరిగిన వార్షిక రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. అధిక వేడి, విపరీతమైన రద్దీ కారణంగా 600 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ఘటనపై పూరీ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ శతపతి వివరాలు వెల్లడించారు. యాత్రకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తీవ్రమైన ఎండ, ఉక్కపోత, రద్దీ కారణంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. చాలామంది వాంతులు, కళ్లు తిరిగి పడిపోవడం, చిన్నపాటి గాయాలు వంటి లక్షణాలు కనిపించాయని ఆయన వివరించారు. వైద్య సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

అస్వస్థతకు గురైన వారిలో చాలామంది ప్రాథమిక చికిత్సతో కోలుకున్నారని, వారిని ఇళ్లకు పంపించేశామని డాక్టర్ కిషోర్ తెలిపారు. ప్రస్తుతం దాదాపు 70 మంది జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి ప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయని వెల్లడించారు. భక్తుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Go Back to Shorts
Puri Jagannath
Puri Rath Yatra
Odisha
Heatstroke
பக்தர்களுக்கு உடல்நலக்குறைவு
Puri Chief District Medical Officer
Dr Kishore Shatapathy
Rath Yatra Health Emergency

More Telugu News