Mallu Bhatti Vikramarka: మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ. 182 కోట్ల జీరో టిక్కెట్లు జారీ: మల్లు భట్టివిక్రమార్క

Mallu Bhatti Vikramarka 182 Crore Zero Tickets Issued to Women Under Mahalakshmi Scheme
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విజయవంతంగా కొనసాగుతోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు రూ. 182 కోట్ల విలువైన జీరో టికెట్లను జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క ప్రసంగించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత ప్రయాణ సేవలకు సంబంధించి కొందరు వ్యక్తం చేసిన ఆందోళనలు అవాస్తవమని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళలు ఉచితంగా ప్రయాణించినప్పటికీ, ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి క్రమం తప్పకుండా చెల్లిస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,088 కోట్లు చెల్లించిందని వివరించారు.

"ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సులు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. దీనివల్ల సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో దోహదపడుతోంది" అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉచిత ప్రయాణ పథకంపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేస్తూ, ఆర్టీసీకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Mallu Bhatti Vikramarka
Mahalakshmi Scheme
Telangana RTC
Free Bus Travel
Zero Tickets

More Telugu News