శంషాబాద్లో లుఫ్తాన్సా విమానానికి తప్పిన ముప్పు.. అత్యవసర ల్యాండింగ్
- ఫ్రాంక్ఫర్ట్ వెళ్తుండగా ఘటన
- ల్యాండింగ్ గేర్లో సాంకేతిక సమస్య
- టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గుర్తింపు
- వెంటనే వెనక్కి మళ్లించి, సురక్షితంగా దించిన పైలట్
- విమానంలో 160 మంది ప్రయాణికులు
వివరాల్లోకి వెళితే, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానం 160 మంది ప్రయాణికులతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్ఫర్ట్కు బుధవారం తెల్లవారుజామున బయలుదేరింది. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే దాని ల్యాండింగ్ గేర్లో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. అనంతరం, విమానాన్ని వెనక్కి మళ్లించి శంషాబాద్ విమానాశ్రయంలోనే అత్యవసరంగా, సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు, సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.