BSF: సరిహద్దు దాటేందుకు యత్నించిన పాకిస్థాన్ జాతీయుడిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్

BSF Shoots Down Pakistani National Trying to Cross Border
షార్ట్స్‌లో చూడండి
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో నిన్న రాత్రి అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఒక పాకిస్థాన్ జాతీయుడిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కాల్చి చంపింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ ఘటన జరిగింది.

ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ జవాన్లు రాత్రి గస్తీ నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సదరు వ్యక్తిని దళాలు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ, ఆ వ్యక్తి హెచ్చరికలను లెక్కచేయకుండా ముందుకు చొచ్చుకురావడంతో, బీఎస్ఎఫ్ జవాన్లు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ పాకిస్థానీ జాతీయుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Go Back to Shorts
BSF
Pakistan National
India-Pakistan Border
Firing
Punjab
Firozpur Sector
International Border
Cross-border Infiltration
Security Threat

More Telugu News