ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ అరెస్ట్
- పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్ట్
- ఢిల్లీ పోలీసుల అదుపులో సామాజిక కార్యకర్త
- కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
మేధా పాట్కర్, వీకే సక్సేనాల మధ్య రెండు దశాబ్దాలకు పైగా న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే, 2000 సంవత్సరంలో సక్సేనా అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 'నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్' అనే స్వచ్ఛంద సంస్థకు అధిపతిగా వ్యవహరించేవారు. ఆ సమయంలో నర్మదా బచావో ఆందోళన్కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ సక్సేనాపై మేధా పాట్కర్ తొలుత ఓ కేసు దాఖలు చేశారు. దీనికి ప్రతిగా సక్సేనా కూడా మేధా పాట్కర్పై రెండు పరువు నష్టం కేసులు దాఖలు చేశారు.
ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మేధా పాట్కర్ వ్యాఖ్యలు చేశారని, అలాగే పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన విడుదల చేశారని ఆరోపిస్తూ సక్సేనా ఈ కేసులను దాఖలు చేశారు. ఈ కేసుల్లో ఒకదానికి సంబంధించి తాజాగా న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.